Tuesday, November 6, 2018

సాహిత్య భగీరధుడు - దాశరధి

సాహిత్య భగీరథుడు - దాశరధి

అరిశిరస్సుల నుత్తరించిన / అలుగునేనే తెలుగు నేనే
అఖిలజగములు చుట్టివచ్చే / పులుగు నేనే, తెలుగునేనే

తెలుగు నేనే, వెలుగునేనే... అని విశ్వరూపాన్ని ప్రద ర్శించిన మహాకవి దాశరధి. ఆయన మహాంధ్రోదయం’’ తెలుగు ఊరులు, తెలుగు వారలు ప్రతిఫలించేకావ్యం. దాశరధికి కావలసింది మహాంధ్రోర్వర. అందుకే తూ రుపు దారికెదురుగా ఉన్న ద్వారబంధాన్ని, మనిషి మన స్సుదారుల రాగబంధంగా వీక్షించాడు. మూడు కోటుల నొక్కడే ముడి బిగించి, మహాంధ్ర సౌభాగ్యగీతాన్ని ముక్త కంఠంతో ఆలపించి అఖిలాంధ్ర ప్రజల హృదయ తంత్రులను మీటిన మేటికవి దాశరధి కృష్ణమా చా ర్యులు. దాశరధి 1927 సెప్టెంబరులో వరంగల్లులోని మానుకోట తాలూకాలోని గూడూరు గ్రామంలో జన్మిం చారు. దాశరధి పుట్టుకతోనే అగ్నిశిఖలాంటి ప్రతిభా మూర్తి. చిన్నతనంలోనే కవితా వ్యవసాయం చేపట్టాడు. ఆ రోజుల్లో కవిసమ్మేళనాల్లో ఈ కవి గొంతెత్తి కవితా గానం చేస్తుంటే ఎవరీ కుర్రకవి, అంటూ అందరూ ఆశ్చ ర్యపోయేవారట. ఆయన జీవితాన్ని ఒక మహా కవితా యజ్ఞంగా భావించారు. అందుకే దాశరధి ఒక మహా కవిగా, ప్రజాకవిగా, ఉద్యమోపజీవిగా జనం గుండెల్లో నిలచిపోయారు. చెట్టుకి ఆకులు వచ్చినట్లుగా కవికి కవి త్వం రావాలని. లేని కవితావేశాన్ని బలవంతాన తెచ్చి పెట్టుకోకూడదు. కవిత్వంగా సహజంగా రావాలి అన్నంత సహజమైనది దాశరధి కవిత్వం. అందుకు మచ్చుతునక ఈ పద్యం.
‘నేనురా తెలంగాణ నిగళాలు తెగగొట్టి / ఆకాశ మంత యెత్తార్చినాను / నేను రాక్షసి గుండె నీరుగా, పద్యాలు / పాడి మానవుని కాపాడినాను / నేను వేస్తంభాల నీడలో నొకతెల్గు / తోట నాటి సుమాలు దూసినాను / నేను పోతన కవీశాను గంటములోని / ఒడుపుల కొన్నింటి బడసినాను / కోటి తమ్ములకడ రెండుకోట్ల తెలుగు / టన్నలను గూర్చి వృత్తాంత మం దజేసి / మూడు కోటుల నొక్కటేముడి బిగించి / పాడి నాను మహాంధ్ర సౌభాగ్యగీతి’’ కొదమ సింహం గర్జిం చినట్లుగా ఉన్న ఈ పద్యాన్ని చూస్తే మహాకవి కలం ఏమిటో సాక్షాత్కరిస్తుంది. మాతృభూమిని, మా తృభాష లను మెన్నతంగా భావించి పులకించిన వైనం దాశర ధిలో కనిపిస్తుంది. మహాంధ్రోదయంలోని తెలంగాణ అనే మొదటి ఖండికలో మాతృభూమిని వేనోళ్ల ప్రశంసిస్తాడు.

కోటి తెలుగుల బంగారు కొండ క్రింద /  పరుచుకొ న్నట్టి సరసులోపల వసించి / ప్రొద్దు ప్రొద్దున అందాల పూలు పూయు / నా తెలంగాణ తల్లి కంజాత తల్లి అని అనడంలో ‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’’
అనే ఆర్యోక్తి అభివ్యక్తీకరించబడింది. తనను కని, పెం చి, పెద్దచేసి మెజ్వల జీవితాన్ని ప్రసాదించిన తెలం గాణ తల్లిని కంజాత తల్లిగా కొనియాడి తన కృతజ్ఞతను చాటుకున్నాడు.

ఆధునిక ప్రపంచంలో ఏ దేశంలో నైనా వర్గసంఘర్షణ, ప్రచ్ఛన్న యుద్ధాలు కనబడుతూనే ఉన్నాయి. శాస్త్ర విజ్ఞానం చంద్రమండలానికి దారితీసినా, మారణె మాని కి కూడా వినియోగించబడుతుంది. విజ్ఞానం రాజకీయ స్వార్ధ శక్తుల చేతుల్లో కీలుబొమ్మ అవుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా, ఆర్ధి క అసమానతలు పొడచూపుతూనే ఉన్నాయి. తత్ఫలి తంగా ప్రపంచశాంతికీ, మానవత్వానికీ స్థానం ప్రశ్నా ర్థకమవుతుంది. మనిషి కోసమే ఈ ప్రపంచం అనేవాళ్లు సైతం మానవతావాదాన్ని పెడదోవ పట్టిస్తున్నారు. భా రతీయులు ప్రజాస్వామ్యవాదులు, ప్రపంచ శాంతి కాముకులు.

‘‘ ఏనాడెవ్వడూ కత్తితో గెలువలేదీ విశ్వమున్, ప్రేమ పాశానన్ కట్టుము నాలుగుంబది ప్రపంచాలన్’’  అంటూ శాంతి లేకపోతే మానవజాతికి మనుగడే లేదు అనే సత్యాన్ని గుర్తించి, లోకమంతా శాంతిపథంలో నడవాలని ఆశించి క్రాంతి కలాన్ని, శాంతి ఖడ్గాన్ని చేతపట్టి కవన, కదన రంగాలలో స్వైరవిహారం చేసిన మానవతామూర్తి దాశరథి. శాంతి ప్రభోదాత్మకమైన కవితా ప్రపంచంలో దాశరథి ‘‘కపోతసందేశం’’ అగ్రశ్రే ణికి చెందిన కావ్యం. ఇందులో హింసను, దానవాంశను నిరసించి, శాంతిని, మానవత్వాన్ని నెలకొల్పే శాంతి సందేశాన్ని కపోతం ద్వారా లోకానికి అందిస్తాడు. శాంతి కోసం ఇతను చెందిన ఆవేదన అంతులేనిది. కనీసం కావ్యాల్లో నైనా శాంతిని బతికించాలని రచయితలకు సందేశాన్ని ఇచ్చిన దాశరధి శాంతి ప్రియత్వం ఎంతో మహత్తరమైనది. గౌతమ బుద్ధుడు, క్రీస్తు, గాంధీ మహాత్ముడు. ఈ ముగ్గురూ అహింసామూర్తులు, శాంతి దూతలు. వీరిజీవితాలు లోకకళ్యాణానికి, విశ్వసౌభాగ్యా నికి అంకితం చేయబడ్డాయి. ఈ ముగ్గురిని ఆదర్శంగా గ్రహించి దాశరధి తన వ్యక్తిత్వంతో పాటుగా, కవిత్వాన్ని కూడా పునీతం చేసాడు. బుద్ధుని వారసునిగా గాంధీజీని అభివర్ణిస్తాడు.
‘‘ అంటరానివారలమని అలమటించు / పంచముల హరిజనులని పాంచజన్య / మూది పలికిన హరిజనాభ్యుదయవాది / గాంధి మహనీయుడే లోకబాంధవుడు’’  అని గాంధీ సుగుణాన్ని వర్ణించాడు.

ముకిళిత పద్మాలను వికసింపచేసి లోకానికి వెలుగులు పంచే లోకబాంధవుడు సూర్యుడు. అలాగే గాంధీ మహా త్ముడు కూడా ముడుచుకుపోయిన మానవ హృదయ పద్మాలను వికసింపచేసి, విజ్ఞాన వెలుగులు పంచాడనే భావాన్ని వ్యక్త పరచాడు. ఈ గాంధేయవాది విప్లవాన్ని హింసతో కంటే ప్రేమతోను, త్యాగంతోను సాధించ వచ్చునని నమ్ముతాడు.
 నీగ్రోపై ‘‘నల్లనివాడ జ్ఞాన నయనమ్ములవాడ’’ అంటూ పోతన శైలిలో పద్యం చెప్పిన నవనీత హృద యుడు మన దాశరథి. ఇతనికి యుద్ధాలూ, మతోన్మా దాలు, మారణెమాలే గిట్టవు. అణ్వస్త్రపు గ్రీష్మానికి ప్రతీ పద్యం ఒక మబ్బుపింజ కావాలని ఇతని ఆకాంక్ష. అంత:కలహాలు పనికి రావు, అంతరంగ బంధాలు, అనురాగ రాగాలు కావాలి అని ఐక్యతా సంగీతాన్ని వినిపిస్తాడు.

పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ, మహాబోధి, గాలిబ్ గీతాలు , మొదలైన రచనలు చేసి ఎన్నో సన్మానాలు, జాతీయ స్థాయి అవార్డులతో సత్కరింపబడి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిపీఠాన్ని అలం కరించాడు. ‘‘నా జీవితమే నా పోరాటం, ఎన్నో ప్రతీప శక్తులతో పోరాడాను, పోరాడగలను, నేను ఆశావాదిని. దురాశావాదులు నిరాశపడతారు. ఆశావాదికి నిరాశ లేదు. నమ్రతతో నా దారిన నేను పయనిస్తాను. నా గమ్యం ప్రపంచ శాంతి, నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం. జనం మనం మనం జనం, జనం లేక మనం లేము’’ అని నుడివిన దాశరధి జనం తానుగా తాను జనంగా బతికిన మానవతావాది, శాంతి కాముకుడు. ఆయన తెలుగువారి గుండెల్లో  నిలిచిన ‘కళాప్రపూర్ణుడు’, సాహిత్య భగీరథుడు.

No comments:

Post a Comment